ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 09:32 AM

బనగానపల్లె పట్టణంలోని నేలమఠం సమీపంలోని బంకు వద్ద నిద్రిస్తున్న శంకర్‌(40) అనే వ్యక్తిదారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. బనగానపల్లెలో గత రెండు నెలలుగా నివాసం ఉంటున్న శంకర్‌ గౌండా పనికి పోయి నేలమఠం వద్ద భోజనం చేస్తూ సమీప ప్రాంతాల్లో నిద్రించేవాడు.


గ్రామం నివాసి వెంకటేశ్వరరెడ్డి కూడా శంకర్‌తో కలిసి గౌండా పని చేస్తూ అతనితోనే ఉండేవాడు. గురువారం మధ్యాహ్నం ప్రాంతంలో స్టేట్‌ బ్యాంకు వద్ద ఇద్దరూ మద్యం తాగి ఘ ర్షణ పడ్డారు. శంకర్‌ వెంకటేశ్వరరెడ్డిని దూషించాడు.


ఇది మనసులో పెట్టుకొని వెంకటేశ్వరరెడ్డి నేలమఠం సమీపంలోని బంకు వద్ద శంకర్‌ నిద్రిస్తుండగా గురువారం అర్ధరాతి 12 గంటల సమయంలో రోకలి బండతో తలపై బాదాడు. దీంతో శంకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.


శంకర్‌ మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వవైద్యశాలకు పోస్టుమార్టం నిర్వహించినట్లు సీఐ సుబ్బరాయుడు శుక్రవారం తెలిపారు. వెంకటేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com