ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్ కు మాత్రమే సాధ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 11, 2022, 02:52 PM

కర్నూలు: మునుపెన్నడూ లేని విధంగా ఆర్య వైశ్యుల అభ్యున్నతికి పెద్ద పీట వేస్తూ, ఆర్య వైశ్యులకు అండదండలు అందిస్తూ, తాను నమ్మిన, తనను నమ్మిన ప్రజలకు మంచి చేయడమే ఏకైక లక్ష్యమని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారని, ఆర్యవైశ్య సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు గ్రందే వెంకట గిరి అన్నారు.


రాష్ట్రంలోని ఆర్య వైశ్యుల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఆంద్రప్రదేశ్ వెల్ ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు రికార్డు స్థాయిలో 915. 49కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి యావత్ ఆర్యవైశ్య సోదరీ సోదరుల అభిమానాన్ని పొందారన్నారు.


ఇప్పటికే రాష్ట్ర మంత్రి మండలిలో కీలకమైన దేవాదాయ శాఖ మంత్రిగా మన ఆర్య వైశ్యుల పెద్ద దిక్కు వెలంపల్లి శ్రీనివాస్ నియమించడం, కార్పోరేషన్ల చైర్మన్ పదవులను, ప్రముఖ దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లుగా, సభ్యులు గా అవకాశం కల్పించి ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆర్యవైశ్య కార్పొరేషన్ కు దాదాపు వెయ్యి కోట్ల నిధులు కేటాయించినందుకు, ఆర్యవైశ్య పక్షపాతిగా నిలుస్తున్నందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్య వైశ్యుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.


అదేవిధంగా ఆర్య వైశ్యుల సమస్యలను, విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి, దృష్టికి తీసుకు వెళుతూ, నిరంతరం ఆర్య వైశ్యుల అభ్యున్నతి కోసం శ్రమిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెలంపల్లి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలుపు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కుప్పం ప్రసాద్ అభినందనలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com