కృష్ణా జిల్లా: ఓదళిత యువతిని మాయమాటలతో పెళ్లి చేసుకుంటానని చెప్పి రాయని రవితేజ, వ్యవహార నేపథ్యంలో పటమట ప్రాంతంలో అక్రమ మహిళ గృహనిర్బంధ పరిస్థితుల పై పటమట సీఐ సురేష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గత కొన్ని రోజులుగా తెలుగు తేజం దినపత్రికలో ప్రచురించిన కథనాలపై స్పందించిన పటమట సీఐ సురేష్ రెడ్డి, గురువారంనాడు అక్రమ నిర్బంధం ఉన్న గృహాలను పటమట పోలీసులు తనిఖీలు చేశారు. ఈ ప్రాంతంలో ఎవరెవరు సూత్రధారులు గా ఉన్నారని వారి వ్యవహారాల పై కన్నేసిన సురేష్ రెడ్డి బృందం. ఒత్తిళ్లకు తలొగ్గకుండా చిత్తశుద్ధితో, ఈ ప్రాంతంలో రవితేజ ఆగడాల వ్యవహారంపైనివేదికను రూపొందించారు. పటమట పోలీసుల విచారణలో పలు విషయాలు వెలుగు చూశాయి.
ఈ ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారంపై ఆయన సీరియస్ గా దృష్టిసారించారు. పలువురిపై నివేదిక రూపొందించి, సౌజన్య, రాజకుమారిలు వీరిద్దరూ ఖరీదైన ఇల్లు అద్దెకు తీసుకొని ఆర్గనైజింగ్ చేస్తూ పట్టుబడ్డారు. వీరితో పాటు కరిమున్నిసా వెస్ట్ బెంగాల్ కు చెందిన చక్రబర్తి తో పాటు గుంటూరు జిల్లా, వడ్డేశ్వరం కు చెందిన ప్రసన్నకుమారి, భవానీ, ని వీరందరూ సుమారుగా ఆరు నెలల నుండి, ఇల్లు అద్దెకు తీసుకొని మహిళ అక్రమ నిర్బంధ వ్యవహారాలు చేస్తు పట్టుబడ్డ వారిని, స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి చర్యలు చేపట్టేందుకు పటమట పోలీసులు శ్రీకారం చుట్టారు.