క్రికెట్ అభిమానులకు కర్ణాటక సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. భారత్, శ్రీలంక మధ్య జరగనున్న రెండో టెస్టుకు పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు అనుమతినిచ్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈనెల 12 నుంచి రెండో టెస్టు(డే అండ్ నైట్) జరగనుంది. కరోనా తర్వాత భారత్లో జరిగే ఒక అంతర్జాతీయ మ్యాచ్కు 100 శాతం ప్రేక్షకులను అనుమతించడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ తో రోహిత్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో 400 వ మ్యాచ్ ఆడనున్నాడు. ఇక ఇప్పటికే తొలి టెస్టును గెలుచుకున్న టీమిండియా రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.