న్యూఢిల్లీ : రైలు ప్రయాణీకులకు త్వరలో విమాన ప్రయాణీకుల తరహా ఆహారం అందనుంది. అవును. ప్రస్తుతం ఉన్న ఆహార మెనును తీసేసి, ఆ స్థానంలో విమానయాన సర్వీసుల్లో అందిస్తున్న మెనూను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. రైళ్లలో అందిస్తున్న ఆహారం నాసిరకంగా ఉండటమే ఇందుకు కారణమని సమాచారం. ఆహారంపై రైల్వే బోర్డు నియమించిన రైల్వే కమిటీ ఈ మేరకు సూచనలు చేసినట్లు తెలిసింది. అయితే, ఆహారపదార్థాలతో పాటు వాటి ధరలూ కూడా పెరగనున్నాయి. దీంతో కొత్త మెనూ పిండి కొద్దీ రొట్టె అనే సామెతలా ఉండబోతోందన్నమాట.