ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైళ్లలో విమాన తరహా భోజనం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 14, 2017, 10:50 AM

న్యూఢిల్లీ : రైలు ప్రయాణీకులకు త్వరలో విమాన ప్రయాణీకుల తరహా ఆహారం అందనుంది. అవును. ప్రస్తుతం ఉన్న ఆహార మెనును తీసేసి, ఆ స్థానంలో విమానయాన సర్వీసుల్లో అందిస్తున్న మెనూను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. రైళ్లలో అందిస్తున్న ఆహారం నాసిరకంగా ఉండటమే ఇందుకు కారణమని సమాచారం. ఆహారంపై రైల్వే బోర్డు నియమించిన రైల్వే కమిటీ ఈ మేరకు సూచనలు చేసినట్లు తెలిసింది. అయితే, ఆహారపదార్థాలతో పాటు వాటి ధరలూ కూడా పెరగనున్నాయి. దీంతో కొత్త మెనూ పిండి కొద్దీ రొట్టె అనే సామెతలా ఉండబోతోందన్నమాట. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com