తిరుమల: తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది. నిన్న 78,108 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగింది.40,580 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీకి భక్తులు సమర్పించిన నగదు 2.89కోట్లు.