ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 25 వరకు జరగనున్నాయి. రేపు దివంగత గౌతమ్ రెడ్డి మృతిపై ప్రభుత్వం సంతాప తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఈ నెల 9,12,13, 18, 19, 20 తేదీల్లో సభకి సెలవు ఉంటుంది. ఈ నెల 10న్ గవర్నర్ ప్రసంగానికి సభ ధన్యవాదాలు తెలపనుంది. ఈ నెల 11న అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 14,15 తేదీల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. ఈ నెల 16, 17, 21, 22, 23, 24న బడ్జెట్ డిమాండ్ లపై చర్చ జరుగుతుంది. ఈ నెల 25న ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.