తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం దారుణం చోటుచేసుకున్నది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక కొడుకు కన్న తండ్రినే చంపిన ఘటన వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం వి.వి.మెరకలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో శరత్ అనే వ్యక్తి తన తండ్రి శేఖర్(55)ను హతమార్చాడు. తన ఫ్రెండ్స్ సహాయంతో ఇనుప రాడ్తో కొట్టి తండ్రిని హత్య చేశాడు. తండ్రిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.