విశాఖపట్నం : రానున్న మూడు, నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం నమోదు కానుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం వుందని వాతావరణశాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బుధవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడే అవకాశాలున్నాయి. కాగా మధ్య మహారాష్ట్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, తమిళనాడు పరిసరాల్లో దట్టమైన మేఘాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లో ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.