శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు 574/8 వద్ద రెండోరోజు డిక్లేర్ చేసింది. భారత జట్టులో జడేజా అజేయంగా 175 పరుగులు చేశాడు. అశ్విన్ కూడా 61 పరుగులతో సహకారం అందించాడు. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(96), హనుమ విహారి (58), కోహ్లి(45), మయాంక్ అగర్వాల్(33), రోహిత్ శర్మ (29), శ్రేయస్ అయ్యర్ (27) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లక్మల్, ఫెర్నాండో, ఎంబుల్డేనియా రెండేసి వికెట్ల చొప్పున సాధించారు. లహిరు కుమార, ధనుంజయ డిసిల్వకు ఒక్కో వికెట్ దక్కింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది.