చిత్తూరు: నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన గృహ నిర్మాణాలపై బీకొత్తకోట మండలంలోని బడికాయలపల్లెలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హౌసింగ్ ఏఈ ఆకుల సత్యనారాయణ ప్రభుత్వం ప్రతి ఇంటికి మంజూరు చేసిన యూనిట్ విలువ, సిమెంటు, స్టీలు సరఫరా , విడతలవారీగా బిల్లులు చెల్లింపు వివరాలను వివరించారు.