నాసన్ భూనిర్వాసితులు, రైతు సంఘం నాయకులను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఏర్పాటు కానున్న నాసన్ స్థాపన కోసం 2015లో 600 కోట్లు వెచ్చించి రైతుల నుంచి 500ఎకరాల భూమిని తీసుకున్నారు. అప్పటి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా 2015 ఏప్రిల్ లో కంపెనీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. కొంతమంది రైతులు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం తమకు సరిపోదని కోర్టును ఆశ్రయించారు