న్యూఢిల్లి : బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నేడు కాంగ్రెస్కు కంచుకోట అయిన అమేథీలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల అమేథీలో పర్యటించారు. దీనితో ప్రస్తుత అమిత్షా అమేథీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు అమిత్ షా అమేథీ చేరుకోనున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇప్పటికే అమేథీ చేరుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఇరువురు నేతలతో కలిసి అమేథీలో పర్యటించే అవకాశం ఉంది.