జనసేన పార్టీ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ లో దీక్షకు గురువారం పిలుపునిచ్చింది. దీక్ష కు వెళ్లకుండ నియోజవర్గ జనసేన నాయకులు శ్రీ రామ్ ను దేవరపల్లి పోలీసులు గురువారం ఉదయం వాకపల్లి ఆయన స్వగృహంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ దీక్షకువెళ్తున్న తమను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఫీజుల పెంపును వెంటనే తగ్గించాలని అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఆచార్య లుపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు 19 91 యాక్టుకు వ్యతిరేకంగా రిజిస్టర్ నియామకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంత మంది కార్యకర్తలును నాయకులను అరెస్ట్ చేసిన జనసేన ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపలేదని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తు ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.