సత్తెనపల్లి పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో నూతనంగా అభివృద్ధి చేస్తున్న చెరువు పనులను ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పరిశీలించారు. చెరువు అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి ఐదు అడుగుల మేర నీటిని నింపాలని అధికారులను స్పీకర్ ఆదేశించారు. చెరువు అభివృద్ధి పనులు పూర్తయితే వీటిలో ఏర్పాటు చేసే బోటింగ్ ద్వారా సత్తెనపల్లి పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇప్పటికే చెరువు చుట్టు మనం ఏర్పాటు చేసుకున్న వాకింగ్ ట్రాక్ ద్వారా నిత్యం వందలాది మంది అక్కడ వాకింగ్, వ్యాయామంతో నిత్యం రద్దీగా, ఆహ్లాదంగా మారింది. ఇక చెరువులో పూర్తిస్థాయిలో నీటిని నింపితే జలకళతో ఈ ప్రాంతమే ఆహ్లాదంగా మారుతుందన్నారు. ఈ విజిట్ లో టీడీపీ యువనాయకులు డాక్టర్ కోడెల శివరామ్, సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ రామస్వామి ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.