రాజంపేట మునిసిపాలిటీ లో అధ్యక్షుడు పోలా శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన సోమవారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజంపేట మునిసిపాలిటీ కి అవసరమైన సదుపాయాల కల్పన వనరులపై చర్చించి అనుమతులకు తీర్మానాలు చేశారు.
ముఖ్యంగా శానిటేషన్ పై శ్రద్ధ చూపాలని అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మర్రి రవి కుమార్, షేక్ సుమియా లతోపాటు తదితర కౌన్సిలర్లు పాల్గొన్నారు.