తెర్లాం మండలంలో అరస బలగ, కొత్తచెరువు లో అక్రమంగా మట్టి తవ్వుతున్న జెసిబి ని, మూడు ట్రాక్టర్లను రెవెన్యూ ఇన్స్పెక్టర్ భవాని, విఆర్వో కలిసి సోమవారం దాడి చేశారు.
వాల్టా యాక్ట్ ప్రకారం నిబంధనలకు వ్యతిరేకంగా చెరువులో మట్టి తవ్వడం, నిలుపుదల చేశామని ఆయన తెలిపారు.
లంక అప్పలనాయుడు ఏపీ30- టి ఎ129, గుణుపూర్ ఆదినారాయణ ఏపీ35 డబ్ల్యు6504, సామంతుల తిరుపతి, ఏపీ 30- టి ఏ0451 డ్రైవర్లను, ఏపీ 39 జిఎన్ 6656 నెంబరు గల జెసిబి ని, డ్రైవర్ అల్లు గణేష్ నీ, అదుపులోకి తీసుకున్నట్లు తాసిల్దార్ డి. రాజేశ్వరరావు తెలిపారు. వీరిపై వాల్టా యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొని జరుగుతుందన ఆయన తెలిపారు.