ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని హత్య చేసేందుకు రష్యా ప్లాన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త బ్రిటిష్ వార్తాపత్రిక టైమ్స్ నుండి వచ్చింది. రాజధాని కీవ్ లో 400 మంది రష్యా ఉగ్రవాదులు ఉన్నారని టైమ్స్ అభిప్రాయపడింది. రష్యానే ఆ ఉగ్రవాదులని పంపిందని టైమ్స్ లో వెలువరించారు. మరో వైపు జెలెన్ స్కీ కీవ్ నగరంలో ఉండి పౌరులతో పాటు యుద్ద రంగంలో పాల్గొంటున్నారు. అమెరికా రక్షణ కల్పిస్తామన్న ఆయన వెళ్లలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడిని చంపితే ప్రజలను భయపెట్టవచ్చని రష్యా అభిప్రాయంగా తెలుస్తోంది. తనకు ప్రాణ భయం లేదని ఇప్పటికే జెలెన్ స్కీ ప్రకటించారు. ఓ వైపు చర్చలు అంటూనే రష్యా మరో వైపు యుద్దాన్ని మాత్రం ఆపడం లేదు.