ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుతిన్ పై మండి పడ్డ ఉక్రెయిన్‌ మాజీ అధ్యక్షుడు

international |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 10:41 AM

రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఉక్రెయిన్‌ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో మండిపడ్డారు. పుతిన్ కు పిచ్చిపట్టిందని అన్నారు. పెట్రో పోరోషెంకో ఏకే47 తుపాకీతో తమ సైన్యంతో కలిసి గస్తీ కాస్తున్నారు. తమ ప్రాణాలు ఉన్నంతవరకు రష్యా తమ దేశాన్ని ఆక్రమించుకోలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పుతిన్‌ కేవలం ఉక్రెయిన్‌ పై యుద్ధం ప్రకటించలేదని, ప్రపంచ దేశాలపై యుద్ధం ప్రకటించాడని పోరోషెంకో పేర్కొన్నారు.
దేశం కోసం పోరాడేందుకు తమ పౌరులు సిద్ధంగా ఉన్నారని, కానీ తమవద్ద ఆయుధాలు లేనవన్నారు. పరిమిత సంఖ్యలో మెషీన్‌ గన్స్‌ ఉన్నాయని చెప్పారు. యుద్ధ ట్యాంకులు, భారీ మందుగుండు సామగ్రి లేదని, తమకు మరిన్ని ఆయుధాలు కావాలని ఆయన తెలిపారు. ఆయుధాలు లేకపోయినా భయపడబోమని, ఎంతమంది సైనికులు దాడిచేసినా, మిస్సైల్స్‌ వదిలినా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యుద్ధ సామగ్రిని అందించేందుకు ముందుకొచ్చిన అమెరికా, బ్రిటన్‌కు ధన్యవాదాలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com