ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు

national |  Suryaa Desk  | Published : Sat, Feb 26, 2022, 01:09 PM

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం వేగంగా తరలిస్తోంది. తాజాగా హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 490 మందిని రెండు విమానాల్లో తీసుకొస్తోంది. ఇందులో 30 మందికిపైగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ అర్థరాత్రికి తొలి విమానం ముంబైకి చేరనుంది. మరో విమానం రేపు ఉదయానికి ఢిల్లీకి రానుంది. ప్రస్తుతం ఆ దేశంలో 18 వేలకు పైగా భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారందరినీ స్వదేశానికి తరలించే అవకాశాలను అధికారులు చర్చిస్తున్నారు. ఇప్పటికే భారత జెండా ఉన్న వాహనాలపై దాడి చేయొద్దని రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com