ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం వేగంగా తరలిస్తోంది. తాజాగా హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 490 మందిని రెండు విమానాల్లో తీసుకొస్తోంది. ఇందులో 30 మందికిపైగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ అర్థరాత్రికి తొలి విమానం ముంబైకి చేరనుంది. మరో విమానం రేపు ఉదయానికి ఢిల్లీకి రానుంది. ప్రస్తుతం ఆ దేశంలో 18 వేలకు పైగా భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారందరినీ స్వదేశానికి తరలించే అవకాశాలను అధికారులు చర్చిస్తున్నారు. ఇప్పటికే భారత జెండా ఉన్న వాహనాలపై దాడి చేయొద్దని రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.