అత్తింటి వేధింపులు తాళలేక న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించిన కీర్తి స్పందన ఫిర్యాదుపై స్థానిక పోలీసులు స్పందించి అత్త, మామ, భర్త, మరిది పై శుక్రవారం కేసు నమోదు చేశారు. ప్రేమించి, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహమాడి, ఒక బిడ్డ పుట్టిన అనంతరం, కుటుంబ సభ్యుల చెప్పుడు మాటలు విని, కట్నం కోసం వేధిస్తూ, నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్న నేపథ్యంలో ఏడాది బిడ్డతో సహా పుట్టింటికి చేరిన ఆ మాతృమూర్తి న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అడవినెక్కలం గ్రామానికి చెందిన కొమ్మినేని కీర్తి స్పందన, ఫిర్యాదును స్వీకరించిన ఎస్సై నంబూరి చంటిబాబు, భర్త నర్రా బాల భాస్కర్ , అత్త ధనలక్ష్మి, మామ శ్రీరాములు , మరిది యస్వంత్ లపై అదనపు కట్నం కోసం వేధింపులు, కీర్తి స్పందన ను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చంటి బాబు చెప్పారు.