ఈనెల 27 ఆదివారం జరుగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నూరు శాతం విజయవంతం చేయాలని నాగుల్లంక పీహెచ్ సీ వైద్యాధికారులు వై. శ్రీవల్లి, కె. సుబ్బరాజు విజ్ఞప్తి చేశారు. పి. గన్నవరం మండలంలోని 20 గ్రామాల్లో ఐదు సంవత్సరాల లోపు వయసుగల పిల్లలు 6003 మంది ఉన్నారని వివరించారు. పోలియో చుక్కలు వేసేందుకు మొత్తం 164 మంది సిబ్బందితో 41 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు