సీబీఐ కోర్టులో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 2 నుంచి పాదయాత్ర చేపడుతున్నందున ప్రతీ శుక్రవారం హాజరయ్యే విచారణకు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఆరు నెలలపాటు కోర్టుకు రాకుండా ఉండేందుకు అనుమతించాలని జగన్ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. కాగా సీబీఐ కోర్టు దీనిపై తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది