భర్త, అత్తామామలు, మరిది కొన్ని నెలలుగా అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ వివాహిత ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు. మండలంలోని రావిపాటివారిపాలెం గ్రామానికి చెందిన నేలపాటి లావణ్యకు తొమ్మిదేళ్ల క్రితం చినకొండ్రుపాడు గ్రామానికి చెందిన నేలపాటి నవీన్ తో వివాహమైంది. వీరికి బాబు, పాప సంతానం. కొన్ని నెలల నుంచి భర్త, అతడి కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం ఆమెను వేధిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.