ద్విచక్రవాహనాన్ని టాక్టరు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం పట్టణ శివారులోని గుంటూరు రోడ్డులో చోటు చేసుకొంది. స్థానికుల కథనం ప్రకారం పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై కొండమోడు వైపు నుంచి వస్తున్నారు. ఎదురుగా వచ్చే ట్రాక్టరు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ద్విచక్రవాహనం మీద ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం పట్టణంలోని ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు.