ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ తరఫున మరో రెండేళ్లు క్రికెట్ ఆడాలని ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 06, 2017, 03:56 PM

భారత్ తరఫున మరో రెండేళ్లు క్రికెట్ ఆడాలని తాను కోరుకుంటున్నట్లు వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో శనివారం నుంచి జరగనున్న మూడు టీ20 సిరీస్‌కి సెలక్టర్లు 38 ఏళ్ల నెహ్రాని భారత జట్టులోకి ఇటీవల ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో తొలి టీ20కి ఆతిథ్యమివ్వనున్న రాంచీకి చేరుకున్న నెహ్రా మీడియాతో మాట్లాడాడు. ఇప్పటికే కెరీర్‌లో చాలా సార్లు గాయాలబారిన పడ్డానని.. అయితే మళ్లీ ఫిటెనెస్‌ కోసం తాను పట్టుదలతో శ్రమించినట్లు చెప్పుకొచ్చాడు.


‘నేను మరో రెండేళ్లు క్రికెట్ ఆడాలని ఆశిస్తున్నా. కానీ.. అది అంత సులభం కాదు. ఎందుకంటే 38-39 ఏళ్ల బౌలర్‌ శరీరం వేగంగా బంతులు విసిరేందుకు అంతగా సహకరించకపోవచ్చు. అయితే నా శాయశక్తులా ఆడేందుకు ప్రయత్నిస్తా. గత ఏడెనిమిదేళ్లుగా భారత్ జట్టుకి దూరమైనప్పుడు నేను ఆటని చాలా మిస్ అయ్యాను. అందుకే పట్టుదలతో ఫిటెనెస్ సాధించి మళ్లీ జట్టులో చోటు సంపాదించగలిగాను. నా శరీరం సహకరించే వరకూ క్రికెట్ ఆడతా’ అని నెహ్రా ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్‌ ఆడిన నెహ్రా.. అనంతరం గాయంతో గత ఎనిమిది నెలలుగా భారత్ జట్టుకి దూరంగా ఉన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com