కర్నూలు జిల్లాలో కోవిడ్-19 నియంత్రణలో భాగంగా వివిధ విభాగాల్లో పని చేసేందుకు తాత్కాలిక డిప్యూటేషన్లపై నియమించిన ఉపాధ్యాయులను రిలీవ్ చేశారు. కరోనా సమయంలో కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని సీసీటీవీ, డీఆర్డీఏలోని 104 కాల్ సెంటర్, జిల్లా పరిషత్ లోని 104 కాల్ సెంటర్లో విధులు నిర్వహించేందుకు 190 మంది టీచర్లను నియమించారు.
కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో తాత్కాలిక డిప్యూటేషన్లపై అందిస్తున్న టీచర్లందరినీ గురువారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మనజీర్ జిలానీ శామున్ రిలీవ్ చేసినట్లు డీఈవో రంగారెడ్డి తెలిపారు.
ఇదివరకే 32 మందిని రిలీవ్ చేయగా మిగిలిన 158 మందిని కూడా రిలీవ్ చేశామని, వారందరూ తక్షణమే స్కూళ్లలో విధులు నిర్వహించేందుకు రెగ్యులర్గా వెళ్లాలని డీఈవో సూచించారు.