నైపై : రెండు రోజుల పర్యటన నిమిత్తం మయన్మార్ వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మయన్మార్ ప్రభుత్వ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీతో బుధవారం భేటీ అయ్యారు. ఇరువురు నేతలు భారత్-మయన్మార్ ద్వైపాక్షిక సంబం ధాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో మయన్మార్లో రఖినె రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలైన బౌద్ధులు రోహింగ్యా తెగ ముస్లింల మ ద్య దాడుల నేపథ్యంలో వేలాది మంది రోహింగ్యాలు ప్రా ణాలు అరచేత పట్టుకొని భారత్కు వలస వస్తున్న విష యంపై చర్చ జరిగినట్లు వివరించారు. తమ దేశంలోకి పెద్ద ఎత్తున రోహింగ్యాల వలసలపై ప్రధాని మోడీ ఆందో ళన వ్యక్తం చేస్తూ, అక్రమంగా ప్రవేశించిన 40వేల మంది రోహింగ్యాలను తిరిగి పంపే ఏర్పాట్లు విషయమై ఇరువురుమధ్య ఈ చర్చ జరిగినట్లు సమాచారం .
సమావేశ అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ భద్రత, ఉగ్రవాద నిరోధం, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన, ఇంధన రంగాల్లో ఇరుదేశాలనడుమా ఇప్పటికే కుదిరిన దె్వైపాక్షిక ఒప్పందాలను, పరస్పర సహకారాన్ని మరింత పటిష్టంగా అమయలు చేసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. భారత్ను సందర్శించాలనుకునే మయన్మార్ వాసులకు ఉచితంగా వీసాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, భారత్లోకి అక్రమంగా ప్రవేశించి జైళ్లలో మగ్గుతున్న 40 మంది మయన్మార్ పౌరులను విడుదల చేసి త్వరలో వారి స్వదేశానికి పంపివేస్తామని మోడీ ఈ సందర్భంగా ప్రకటించారు. అంతకు ముందు మియన్మార్ దేశ ప్రధాని యూ హాతిన్ క్వాతో నూ మోడీ సమావేశమె ైపలు అంశాలపైచర్చించారు. ఈ సందర్భంగా హాతిన్క్వా ప్రధానికి 1841 నాటి సాల్వీన్ నది మ్యాప్, బోధి వృక్షం జ్ఞాపికలను బహూకరించారు.