లఖ్నవూ: ఉత్తరప్రదేశ్లో నాలుగోవిడత పోలింగ్ ప్రారంభమైంది. ఇక్కడ మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 53 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 12 జిల్లాల్లో ఈ పోలింగ్ ప్రారంభమైంది. 1.85కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. రాయిబరేలీ, అలహాబాద్ వంటి స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.