ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర మంత్రితో పాటు పోర్ట్ ట్రస్ట్ పర్యటనలో పాల్గొన్న అరకు ఎంపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 04:31 PM

ఈ రోజు విశాఖపట్నంలోని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఆధ్వర్యంలో జరిగిన పలు శంకుస్థాపన కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరైన అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి. దేశ ఎగుమతులు మరియు దిగుమతులలోనే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కి ప్రత్యేక స్థానం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న రోజుల్లో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలని కోరారు.


అనంతరం కొంత సేపు ప్రజా ప్రతినిధులు మరియు పోర్ట్ అధికారులతో కలిసి పోర్ట్ లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, అనకాపల్లి ఎంపి సత్యవతి, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామ మోహన్, మరియు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com