హంద్రీనీవా ప్రధాన కాలువ క్రింద సాగులో ఉన్న వేరుశనగ, ఇతర పంటలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సాగు నీటిని సరఫరా చేయాలని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి లేఖ వ్రాసారు. గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గంలలో 20 వేల ఎకరాల పైగా వేరుశనగ, ఇతర పంటలను రైతులు సాగు చేశారని, ఏప్రిల్ చివరి వారము వరకు సాగునీరు వస్తాయని ఆశతో రైతులు సాగు చేశారని, ఎలాంటి హెచ్చరికలు లేకుండా హంద్రీనీవా ప్రధాన కాలువకు నీటిని నిలిపివేయడంతో 20 వేల ఎకరాల్లోని వేరుశనగ పంట చేతికి రావడం ప్రశ్నార్థకంగా మారిందని లేఖలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.