ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాగిన మత్తులో భర్త పైశాచికం

national |  Suryaa Desk  | Published : Tue, Feb 22, 2022, 12:25 PM

కొంతమంది తాగితే మనుషుల్లా అస్సలు ప్రవర్తించరు. తమ వికృత రూపాన్ని భార్యా పిల్లలపై ప్రదర్శిస్తారు. వారు కూడా మనుషులేనని మర్చిపోతారు. తీవ్రంగా గాయపరిచి పైశాచికానందం పొందుతారు. ఇదే కోవలో ఓ వ్యక్తి తన భార్యను నానా హింసలకు గురి చేశాడు. తాగొద్దని చెప్పినందుకు రోజూ హింసించేవాడు. చివరకు వ్యవహారం కోర్టుకు చేరుకోవడంతో జడ్జి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


మహారాష్ట్రంలోని వాడికి ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల వ్యక్తితో బాధితురాలు(22)కు 2017లో వివాహమైంది. కొన్నాళ్లకు వారికి ముద్దులొలికే పాప కూడా పుట్టింది. అయితే భర్త రోజూ తాగి ఇంటికి రావడం ఆమె సహించలేకపోయింది. తాగడం మానేయాలని భర్తను వేడుకొంది. అయితే భార్య మాట పెడచెవిన పెడుతుండడంతో వారిద్దరికీ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆ వ్యక్తి రోజూ తాగి ఇంటికి వచ్చి భార్యతో వికృతంగా ప్రవర్తించేవాడు.


నోట్లో గుడ్డలు కుక్కి, బలవంతంగా శృంగారం చేసేవాడు. చుట్టుపక్కల వారికి ఆ దారుణం తెలియకుండా ఉండేందుకు అలా ప్రవర్తించేవాడు. ఆమెకు ఇష్టం లేకున్నా పట్టించుకోకుండా శారీరకంగా అనుభవించేవాడు. భర్త వికృత చర్యలను బాధితురాలు తన అత్తకు చెప్పింది. అలా జరగకుండా చూస్తానని ఆమె అత్త చెప్పింది. అయితే ఆ తర్వాత అవి మరింత తీవ్రం అయ్యాయి. దీంతో విడాకులే శరణ్యమని బాధితురాలు భావించింది. చివరకు కోట్లు మెట్లెక్కింది. ఆమె బాధలన్నీ విన్న నాగ్‌పూర్ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఇటీవల తీర్పునిచ్చింది. బాధితురాలు కోరుకున్నట్లు విడాకులు మంజూరు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com