ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో మరింత తగ్గిన కోవిడ్ కేసులు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 22, 2022, 12:06 PM

దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయి. ఒకానొక సమయంలో రోజువారీ కేసులు 3 లక్షల 60 వేలకుపైగా నమోదయ్యాయి. అయితే ఆ సంఖ్య ప్రస్తుతం 10 వేలకు చేరుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులు తగ్గుదలతో దేశవ్యాప్తంగా జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. దేశంలో గత 24 గంటల్లో 13,405 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 4,28,51,929కి చేరింది. ఇందులో 4,21,58,510 మంది బాధితులు కోలుకోగా, 5,12,344 మంది మృతిచెందారు. మరో 1,81,075 యాక్టివ్ కేసులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 34,226 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని, 235 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1,75,83,27,441 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు అందులో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com