పశ్చిమ ఆఫ్రికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బుర్కినా ఫాసో దేశంలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. బామ్ బ్లోరా గ్రామంలోని బంగారు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 59 మంది మృత్యువాత పడ్డారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగారాన్ని శుద్ధిచేసే రసాయనాల వల్లే పేలుడు సంభవించిందని ప్రాథమిక అంచనాకు అధికారులకు వచ్చారు. ఆఫ్రికాలో బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి దేశాల్లో బుర్కినా ఫాసో దేశం ఒకటి. ప్రపంచంలో ఐదో అతిపెద్ద దేశంగా ఉంది. ఆ దేశంలోని బంగారు గనుల్లో దాదాపు 10.5 లక్షల మంది ప్రజలు పనిచేస్తున్నారు. దుర్ఘటన జరిగిన గామ్బ్లోరాలో దాదాపు 800 ఎకరాల్లో చిన్న బంగారు గనులున్నాయి. ఇక్కడి నుంచి బంగారాన్ని టోగో, బెనైన్, నైగర్, ఘనా దేశాలకు అక్రమంగా తరలిస్తుంటారు.