ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి మరణవార్తను జీర్ణించుకోలేక పోతున్నామని ఏపిఐఐసి చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి అన్నారు. ఇంతకన్నా దిగ్భ్రాంతికరమైన విషాద వార్తను నా జీవితంలో నేను ఎప్పుడూ వినలేదని సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవలనే దుబాయి పర్యటనకు గౌతమ్ రెడ్డితో కలసి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకుని ఆవేదన చెందారు. ఇంతటి తీవ్ర నష్టాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని గౌతం రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.