బీటెక్ చదువుతున్న మైత్రి (19) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన లేపాక్షి లో చోటుచేసుకుంది. ఎస్ఐ మునీర్ అహ్మద్ తెలిపిన వివరాల మేరకు మల్లిరెడ్డి గ్రామానికి చెందిన ఆదిశేషు, పార్వతి దంపతుల కుమార్తె మైత్రి మదనపల్లిలో బీటెక్ చదువుతుండేది. మొదటి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అయింది. ఈ విషయాన్ని తల్లిదం డ్రులకు తెలిపి సోమవారం జరిగే పరీక్షలకు ఇంటిలోనే చదువుతూ ఉండేది. అయితే పరీక్ష నాలుగు సబ్జెక్ట్ లో తప్పిపోగా రెండు సబ్జెక్ట్ నని ఇంటిలో తెలిపింది. విషయం తెలుసుకున్న తండ్రి మందలించాడు. ఎవరూ లేని సమయంలో మనస్థా పానికి గురైన మైత్రి ఇంటిలో తన బెడ్రూమ్లో చున్నితో ఉరివేసుకుని మృతిచెందింది. తల్లి లేపాక్షి ఆరోగ్యకార్యకర్తగా విధ లు నిర్వహిస్తోంది. తండ్రి వ్యవసాయ పనులకు వెళ్లగా, తమ్ముడు ఇంటర్ చదువుతున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్ఐ మునీర్అహ్మద్ తెలిపారు.