ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబరులో మహీంద్రా జోరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2017, 06:27 PM

 పండుగ వేళ మహీంద్రా అండ్‌ మహీంద్రా వాహన విక్రయాలు జోరుగా సాగాయి. ఈ ఏడాది ఒక్క సెప్టెంబరులోనే 53,663 వాహనాలను విక్రయించినట్లు ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. 2016 సెప్టెంబరుతో పోల్చుకుంటే ఈ ఏడాది 16శాతం అమ్మకాలు పెరిగాయని, 2016 సెప్టెంబరులో 46,130 వాహనాలను విక్రయించినట్లు పేర్కొంది.


సరుకు రవాణా, ప్యాసెంజర్‌ విభాగాల్లో వృద్ధి నమోదు చేసుకుంది. ప్యాసెంజరు వాహనాల్లో 23శాతం, సరుకు రవాణాకు ఉపయోగించే వాహనాల్లో 19శాతం అమ్మకాలు పెరిగినట్లు చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబరులో స్కార్పియో ఎస్‌యూవీలను అత్యధికంగా విక్రయించినట్లు మహీంద్రా పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com