విజయనగరం: జియ్యమ్మవలస మండలం జియ్యమ్మవలస, బిజెపురం గ్రామ సచివాలయాలను ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో చేపడుతున్న పనులను పరిశీలించి, సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డుల పరిశీలించారు. వాలంటీర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో అలసత్వం వహిస్తున్న వాలంటీర్ ను విధులు నుండి తొలిగించమని ఆదేశించారు. అలానే గత టిడిపి ప్రభుత్వం లో సుమారు 50 మంది వరకు అనర్హత పింఛన్లు మంజూరు చేసారని వారు ఇప్పటికి అందుకుంటున్నారని వాటిని వెంటనే తొలిగించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సేవలలో పారదర్శకత పాటించాలని సూచించారు. అందరూ సమయపాలన పాటించి ఫిర్యాదుల శ్వీకరణ లో అలసత్వం వహించకుండా విధులు నిర్వహించాలన్నారు.