మైపాడు బీచ్ లో గల్లంతైన యువకుడి మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. ఇందుకూరుపేట మండలంలోని గంగవరంకు చెందిన అజిత్(17సం) ఉదయం సముద్రంలో ఈత ఆడుతూ ప్రమాదవశాత్తు మునిగి పోయాడు మునిగిపోయాడు. అప్పటినుండి అతడి కోసం గాలిస్తున్న జాలర్ల, పోలీసులకు ఎట్టకేలకు సముద్రంలో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. యువకుడు గీతాంజలి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న ట్లు తెలుస్తోంది. అతని మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.