విండీస్తో చివరిదైన మూడో వన్డేలో శుక్రవారం టీమిండియా తడపడింది. 42 పరుగులకే కీలకమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో భారత్ను రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ జంట ఆదుకుంది. వీరిద్దరూ క్రీజులో కుదురుకుని అర్థ సెంచరీలు నమోదు చేశారు. ఫలితంగా భారత్ స్కోరు 150 పరుగులు దాటించారు. ఈ క్రమంలో రిషబ్ పంత్ 56 వ్యక్తిగత స్కోరు వద్ద విండీస్ హేడెన్ వాల్ష్ బౌలింగ్లో షై హోప్కి క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్కు చేరాడు. ఇక 32 ఓవర్లు పూర్తయ్యే సరికి శ్రేయస్ అయ్యర్ 91 బంతుల్లో 62 పరుగులతో సూర్య కుమార్తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు.