విజయనగరం పట్టణ పరిధి గాజులురేగకు చెందిన బేతల రాంబాబు అనుమానాస్పదంగా మృతిచెందారు. ఈనెల 5 రాత్రి నెల్లిమర్ల ఉపాధిహామీ కార్యాలయంలో జరిగిన చోరీలో రాంబాబు నిందితుడు. గురువారం రాత్రి ఎనిమిది గంటలకు రాంబాబును నెల్లిమర్ల పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారు జాము 4 గంటలకు రాంబాబు అనుమానాస్పదంగా మృతిచెందారు. మృతదేహాన్ని జిల్లాకేంద్ర ఆసుపత్రికి తరలించారు. నెల్లిమర్ల పోలీసుస్టేషన్ లో లాకప్ లో వ్యక్తి మృతిపై జిల్లా కలెక్టర్ ఎ సూర్యకుమారి మెజిస్టిరియల్ విచారణకు ఆదేశించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మృతదేహాన్ని ఆర్డీఓ భవాని శంకర్ సందర్శించారు.