విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా నవరాత్రుల్లో ముఖ్యమైన రోజు మూలా నక్షత్రం. ఇంద్రకీల్రాదిపై కొలువైవున్న కనకదుర్గ అమ్మవారు మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రాత్రి ఒంటిగంటన్నర నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.