బీహార్ లో ఇద్దరు జవాన్ల మధ్య చోటు చేసుకున్న గొడవ ప్రాణాలు తీసుకునే దాకా వెళ్లింది. పాట్నాలోని కంటోన్మెంట్ లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు జవాన్ల మధ్య నెలకొన్న చిన్న వాగ్వాదం తీవ్రంగా మారింది. దీంతో తుపాకులతో ఒకరినొకరు కాల్చుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించారు. ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా ధన్ పూర్ సమీపంలోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఈ ఇద్దరు జవాన్ల మధ్య గత కొంత కాలంగా గొడవలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య గొడవ పెద్దదిగా మారి ఒకరినొకరు కాల్చుకునే వరకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.