ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకరినొకరు హతమార్చుకున్న ఆర్మీ జవాన్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2017, 02:49 PM

బీహార్ లో ఇద్దరు జవాన్ల మధ్య చోటు చేసుకున్న గొడవ ప్రాణాలు తీసుకునే దాకా వెళ్లింది. పాట్నాలోని కంటోన్మెంట్ లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు జవాన్ల మధ్య నెలకొన్న చిన్న వాగ్వాదం తీవ్రంగా మారింది. దీంతో తుపాకులతో ఒకరినొకరు కాల్చుకున్నారు.  ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించారు. ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా ధన్ పూర్  సమీపంలోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఈ ఇద్దరు జవాన్ల మధ్య గత కొంత కాలంగా గొడవలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య గొడవ పెద్దదిగా మారి ఒకరినొకరు కాల్చుకునే వరకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com