దేశ రాజధాని దిల్లీలో ఓ దౌత్యాధికారి సెల్ఫీ తీసుకుంటుండగా ఫోన్ దుండగులు ఎత్తుకెళ్లారు. ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలిఖా గత బుధవారం దిల్లీలోని ఎర్రకోటను సందర్శించారు. ఆ సందర్భంగా సెల్ఫీ తీసుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆయన చేతిలోని ఫోన్ను లాక్కొని పారిపోయాడు. దీంతో ఇగోర్ దిల్లీ హోంశాఖ, పోలీస్ కమిషనర్కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకూ నిందితుల వివరాలు తెలియరాలేదని, దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మధ్యకాలంలో దొంగలు చాలా తెలివి మీరుతున్నారు. కళ్లు మూసి తెరిచేలోగా చోరీలు చేస్తున్నారు.