విశాఖపట్నం: పెదముషిడివాడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థి ఎం. సాయి పార్ధసారథి అదృశ్యమయ్యాడు. అనకాపల్లి శారదానగర్కు చెందిన పార్ధసారథి (14)ని సోమవారం తండ్రి కిషోర్ శ్రీకాంత్ ద్విచక్రవాహనంపై పాఠశాలకు తీసుకొచ్చారు. మళ్లీ కుమారుడిని ఇంటికి తీసుకెళ్లడానికి మధ్యాహ్నం 2. 30గంటలకు పాఠశాలకువెళ్లాడు. అక్కడ కుమారుడు కనిపించకపోవడంతో ఉపాధ్యాయులను అడగ్గా పరీక్షరాసి వెళ్లిపోయాడని చెప్పారు. ఈ మేరకు తల్లి మల్లేశ్వరి ఇచ్చిన ఫిర్యాదుపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు.