న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సందర్భంగా ఇక్కడి ప్యాలస్ హోటల్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జెయి ఇన్, జపాన్ ప్రధాని షిన్ జో అబేతో విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరి మధ్య పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.ఈ విందు సమావేశంలో ప్రధానంగా ఉత్తర కొరియా క్షపణి ప్రయోగాలపై వీరు ముగ్గురూ సుదీర్ఘంగా చర్చించారు. ఉత్తర కొరియా దూకుడును నియంత్రించడానికి తీసుకోవలసిన చర్యలపై వీరు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం