పేదరికపు రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు జారాండ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలపై 25 రూపాయల సబ్సిడీని ప్రకటించింది. ఈ బుధవారం (రిపబ్లిక్ డే) నిన్న నుంచి ఇది అమలులోకి వచ్చినట్టు తెలిపింది. పింక్, గ్రీన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం నెలకు 10 లీటర్ల వరకూ సబ్సిడిని పొందవచ్చని, ద్విచక్ర వాహనదారులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. సబ్సిడీ మొత్తం (రూ.250) వినియోగదారుల బ్యాంకు అకౌంటకు డైరెక్ట్ బెనిపిట్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా చేరుతుందని తెలిపింది. లబ్ధిదారులు పెట్రోల్, డీజిల్ సబ్సిడీ పొందాలంటే యాలో ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా చదవండి దేశ చరిత్రలో తొలిసారి లాల్ చౌక్ క్లాక్ టవర్పై రెపరెపలాడిన త్రివర్ణపతాకంఈ స్కీమును ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు, వ్యవసాయ పనుల కోసం పంట్లు వినియోగించే రైతులకు లబ్ధి చేకూరేలా డిజైన్ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. స్కీమ్ దుర్వనియోగం కాకుండా ఉండేందుకే 10 లీటర్ల కనీస పరిమితిని విధించినట్టు పేర్కొంది. కాగా, గత నెలలోనే ఈ స్కీమ్ ను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. నిరంతర పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం పేదలు, మధ్యతరగతి వర్గాలపై ఎక్కువగా ప్రభావం చూవుతోందని, ఆ కారణంగానే ద్విచక్ర వాహనదారులకు లీటరుకు రూ.25 రూపాయల మేరకు ఉపశమనం కలిగించనున్నామని ఆయన ప్రకటించారు. జనవరి 26వ తేదీ నుంచి స్కీమ్ అమలు చేస్తామని తెలిపారు. జేపీఎం సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా హేమంత్ సోరెన్ ఈ ప్రకటన చేశారు.