ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలన్న అంశం పై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఎంపీ కేశినేని నాని డిమాండ్పై కేంద్రం స్పందించింది.ఎన్డీఆర్కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రతిపాదనలను పీఎంవోకు పంపినట్లు కేశినేని నానికి హోంశాఖ సమాచారమిచ్చింది. జులై 19న లోక్సభలో ఈ అంశాన్ని ఎంపీ కేశినేని నాని లేవనెత్తారు. 377 నిబంధన కింద ఎన్డీఆర్కు అత్యున్నత పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారతరత్న ఎవరికి ఇవ్వాలన్న దానిపై ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకుంటారని కేంద్ర హోంశాఖ తెలిపింది. దీనిపై తాజాగా హోంశాఖ తన స్పందన తెలియజేసింది.