ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాటి పాపం...ఆ తరువాత తరాలను వెంటాడుతుంది

international |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 02:31 PM

పోగే కదా అని ఓ డమ్ము కొట్టి మీరు చేసే నేరంగా అంతా ఇంతా కాదు మరి. మీరు చేసే ఈ నేరానికి మీ తరువాత తరం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మరి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమేనని చెబుతోంది జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం. ఎప్పుడో తాత, ముత్తాతలు పొగ తాగి ఉంటే, ఇప్పుడు వారి మనవరాళ్లలో శరీర ఫ్యాట్ ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 1990ల్లో జన్మించిన 30ఏళ్ల వయసు వారిపై బ్రిటన్ లో ఒక పరిశోధన జరిగింది. యుక్త వయసులోకి రాక ముందు బాలురు కొన్ని రసాయనాల ప్రభావానికి (పొగతాగడం సహా) గురైతే.. తదనంతరం వారి సంతానంపై ప్రభావం ఉంటున్నట్టు తెలిసింది. యక్త వయసుకు వచ్చిన తర్వాత పొగతాగడం, రసాయనాల ప్రభావానికి గురైన వారితో పోల్చి ఈ ఫలితాలను ప్రకటించింది. ‘‘ఈ పరిశోధన రెండు ఫలితాలను అందించింది. యుక్త వయసుకు రాకముందే కొన్నిరసాయనాల ప్రభావానికి గురి అయితే .. తర్వాతి తరాలపై ఆ ప్రభావం ఉంటుందని తెలిసింది. ఆడ పిల్లలు అధిక బరువు సమస్య బారిన పడటానికి ప్రస్తుతం తీసుకునే ఆహారం కాకుండా.. పూర్వీకుల జీవన శైలి ప్రభావం కారణమని అర్థమైంది’’ అంటూ ఈ అధ్యయానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జాన్ గోల్డింగ్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com