వీడియో గేమ్స్ ఆడుకోవడానికి తల్లి వద్ద స్మార్ట్ ఫోన్ తీసుకున్న రెండేళ్ల బాలుడు చేసిన పనికి అంతా షాక్ తిన్నారు. చేసిందంతా చేసి ఏమీ తెలియని వాడిలా ఫోటోలో కూర్చున్న ఈ బాలుడు తల్లి ఫోన్ నుండి ఏకంగా లక్షా 27 వేల రూపాయల విలువైన ఫర్నిచర్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాడు. న్యూజెర్సీలో ఉంటున్న ప్రవాస భారతీయులైన ప్రమోద్ కుమార్-మధు దంపతులు. ఇటీవలే వీరు ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అవసరమైన ఫర్నించర్ ను ఆన్ లైన్ యాప్ లో సెర్చ్ చేసి తర్వాత కొనుగోలు చేద్దామని కార్ట్ లో ఉంచారు. తల్లి వద్ద వీడియో గేమ్ కోసం వీరి బాలుడు ఫోన్ తీసుకున్నాడు. అనూహ్యంగా వాల్మార్ట్ నుంచి పార్సిల్స్ వస్తుండటంతో ఆ బాలుడి పేరెంట్స్ ఆశ్చర్యపోయారు. ఇదంతా తమ కుమారుడి పనే అని తెలుసుకుని ఆర్డర్ క్యాన్సిల్ కోసం వాల్ మార్టుకు పరుగులు పెట్టాయి. సో మీ పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చే ముందు జాగ్రత్త వహించాలని ఈ ఘటన మరో సారి హెచ్చరిస్తోంది.